ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 80,641 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2,068 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 337, చిత్తూరులో 315, కృష్ణాలో 251, ప్రకాశంలో 207, నెల్లూరులో 205 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,64,117 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 22 మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రకాశంలో ఆరుగురు, కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13354 కి పెరిగింది. గత 24 గంటల్లో 2,127 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,29,565 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,198 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ