యావత్ భారతదేశం ఏంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య లోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు ఉదయం 10:30 గంటలకు తీర్పును వెలువరించారు.
- సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.
- అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకే అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది, 2.77 ఎకరాల స్థలాన్ని హిందువులకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది
- మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలి
- మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేశారు
- భూమి కేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి, కేంద్రానికి మూడు నెలల గడువు ఇచ్చిన సుప్రీం కోర్టు
- మూడు నెలల్లో కేంద్రం అయోధ్య ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలనీ కోరింది, స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు 3 నెలలలో ట్రస్ట్ ఏర్పాటు
- 2010లో అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
- ఈ కేసులో ఆర్టికల్ 47 వర్తించదని జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు, 12 సంవత్సరాల తర్వాత సున్నీ వక్ఫ్ బోర్డు పిటిషన్ దాఖలు చేసింది, అయితే మొఘలుల కాలం నాటి నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయింది. శుక్రవారం రోజు ముస్లింలు ప్రార్ధనలు చేసేవారని మాత్రమే ఆధారాలు చూపించింది
- మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని, అక్కడ హిందూ నిర్మాణమే ఉందని పురావస్తు విభాగం చెబుతుందని యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయ నిబంధనల ప్రకారం నిర్ణయిస్తామని చెప్పారు
- పురావస్తు నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు
- వివాదాస్పద స్థలంలో హిందువులు పూజలు చేశారనేందుకు ఆధారాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసినట్టు కూడ ఆధారాలు ఉన్నాయి
- రాముడు అయోధ్యలోనే పుట్టాడనేది నిర్వివాదాంశమని, మసీదు కింద పురాతన కట్టడాల ఆనవాళ్లు ఉన్నాయన్న ఏఎస్ఐ వాదనను తీసిపారేయలేమని అన్నారు
- రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందన్నారు, ఈ స్థలంపై షియా వక్ఫ్ బోర్డు పిటిషన్ తిరస్కరించడంతో పాటు నిర్మోహి అఖాడా పిటిషన్ కూడ కొట్టివేస్తునట్టు చెప్పారు
- బాబర్ దగ్గర పనిచేసిన సైనికాధికారులు మసీదు కట్టారు, కానీ బాబ్రీ మసీదు నిర్మాణ తేదీపై ఎటువంటి స్పష్టత లేదు
- రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలి
- తుది తీర్పు చదివేందుకు అర్ధగంట సమయం పడుతుందన్న జస్టిస్ రంజన్ గొగోయ్
- షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు
- తీర్పు చదవడం ప్రారంభించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్
- సుప్రీం కోర్టుకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఇతర న్యాయ మూర్తులు జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై చంద్ర చూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్