ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో మోడీ వివరించిన మూడు నూతన విధానాలను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం స్వాగతించారు. ప్రధాని మోడీ ప్రసంగంలో జనాభా నియంత్రణ, సంపద సృష్టించే వారిపట్ల గౌరవం చూపించడం, సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ను తొలిగించడం వంటి నిర్ణయాలు స్వాగతించతగినవే అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ ఎర్రకోటలో చేసిన ప్రసంగంపై శుక్రవారం నాడు చిదంబరం ట్విట్టర్లో స్పందించారు. ఈ మూడు నిర్ణయాలలో రెండవది అయినా సంపద సృష్టించే వారిపట్ల గౌరవం చూపించాలని ప్రధాని మోడీ అన్న మాటలను ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి, ఆ శాఖ సిబ్బంది మరియు ఆర్థిక శాఖ పరిశోధకులు స్పష్టంగా వినే ఉంటారని తాను ఆశిస్తున్నానని చెప్పారు.
ఇక జనాభా నియంత్రణ, సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకంపై ప్రజలే ముందుకురావాలని, ఇప్పటికే ఈ విషయాలపై అవగాహనా కల్పించేందుకు వందల కొద్దీ స్వఛ్చంద సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోడీ ప్రసంగంలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం గురించి ప్రస్తావిస్తూ, అక్టోబర్ 2వ తేదీనుంచి ప్రజలంతా ఇంటినుంచే సంచులు తెచ్చుకునేలా వ్యాపారులంతా సూచించాలని చెప్పారు. కుటుంబ నియంత్రణ పాటించని ప్రజలకు జనాభా పెరుగుదల వలన వచ్చే సమస్యలు వివరంగా తెలియజెప్పాలని కోరారు.
All of us must welcome three announcements made by the PM on I-Day
> Small family is a patriotic duty
> Respect wealth creators
> Shun single-use plastic— P. Chidambaram (@PChidambaram_IN) August 16, 2019
Of the three exhortations, I hope the FM and her legion of tax officials and investigators heard the PM’s second exhortation loud and clear
— P. Chidambaram (@PChidambaram_IN) August 16, 2019
The first and third exhortations must become people’s movements. There are hundreds of dedicated voluntary organisations that are willing to lead the movements at local levels
— P. Chidambaram (@PChidambaram_IN) August 16, 2019
[subscribe]
[youtube_video videoid=xL22knzkrwU]