భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో రెండవరోజు భేటీ అయ్యారు. అక్టోబర్ 11, శుక్రవారం నాడు మహాబలిపురంలోని మామల్లాపురంలోని చారిత్రాత్మక కట్టడాలను జిన్పింగ్, మోడీ వీక్షించారు. అక్కడ విందు అనంతరం ఇరు దేశాధినేతలు రెండుగంటల పాటు సమావేశమయ్యారు. మరోసారి శనివారం నాడు కోవలంలోని ఫిషర్ మ్యాన్స్ కొవ్ హోటల్ లో సమావేశమయ్యారు. ముందుగా జిన్పింగ్, ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా చర్చలు జరిపి, అనంతరం ఇరు దేశాల అధికార ప్రతినిధులతో కలిసి చర్చలు జరిపారు. ఈ భేటీలో ద్వైపాక్షిక, అంతర్జాతీయ, ప్రాంతీయ, వాణిజ్య సంబంధాలు, భౌగోళిక అంశాలను చర్చించి వారి అభిప్రాయాలను పంచుకున్నట్టు తెలుస్తుంది.
ఇరు దేశాల అధికార ప్రతినిధుల భేటీ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పారు. ఈ సమావేశాలకు వుహాన్ లో జరిగిన తోలి సమావేశం స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. ఇకపై రెండు బలమైన దేశాలైన భారత్-చైనాల మధ్య విబేధాలు పెరగకుండా చూసుకుంటూ, సమస్యలపై సున్నితంగా స్పందిస్తూ ప్రపంచంలో శాంతి కోసం మన వంతు సహకారం అందిద్దామని పిలుపు నిచ్చారు. జిన్పింగ్ మాట్లాడుతూ, ఈ భారత పర్యటనను ఎప్పటికి మరిచిపోలేనని చెప్పారు. భారతదేశ ఆతిధ్యం ఎప్పటికి జ్ఞాపకంలా గుర్తుండి పోతుందని అన్నారు. మధ్యాహ్నం మరోసారి చర్చల అనంతరం జిన్పింగ్ తిరిగి చెన్నై చేరుకుని, అక్కడ నుంచి నేపాల్ పర్యటనకు వెళ్లనున్నారు.
[subscribe]