బీచ్ లో స్వయంగా చెత్త తొలగించిన ప్రధాని మోదీ

latest political breaking news, Mango News Telugu, Modi Uses Plogging To Pick Trash At Mamallapuram Beach, national news headlines today, national news updates 2019, National Political News 2019, PM Modi Uses Plogging To Pick Trash At Mamallapuram, PM Modi Uses Plogging To Pick Trash At Mamallapuram Beach

మన చుట్టూ ఉండే పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనా అధ్యక్షుడి పర్యటన మేరకు చెన్నైలో ఉన్న ప్రధాని మోడీ తానే స్వయంగా స్వచ్ఛభారత్‌ చేపట్టి, బీచ్ లో చెత్తను ఏరివేస్తూ దేశ ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ ఉదయం తమిళనాడులోని మామల్లపురంలో ఉన్న స్థానిక బీచ్ కు వెళ్లిన మోదీ, అక్కడి పరిసరాల్లో చెత్త కన్పించడంతో ఆయనే స్వయంగా తొలగించారు. సుమారు అరగంట పాటు మోదీ బీచ్ లో తిరుగుతూ అక్కడ చెత్తను తొలగిస్తూ శుభ్రం చేసారు.

మామల్లపురంలోని బీచ్ లో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘ఈ ఉదయం మామల్లపురంలోని బీచ్ కు జాగింగ్ కు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న చెత్తను తొలగించాను. ఇది సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది. అక్కడ సేకరించిన చెత్తను హోటల్ సిబ్బందిలో భాగమైన జయరాజ్‌కు అప్పగించాను. మన బహిరంగ ప్రదేశాలు శుభ్రంగా మరియు చక్కగా ఉండేలా చూద్దాం, మనం దృడంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం ‘ అని మోదీ ట్వీట్ చేసారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + six =