గురుద్వారాను సందర్శించి ప్రార్ధనలు చేసిన మోదీ

latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019, PM Modi Pays Obeisance At Ber Sahib Gurudwara, PM Modi Pays Obeisance At Ber Sahib Gurudwara In Sultanpur Lodhi, PM Pays Obeisance At Ber Sahib Gurudwara, PM Pays Obeisance At Ber Sahib Gurudwara In Sultanpur, PM Pays Obeisance At Ber Sahib Gurudwara In Sultanpur Lodhi

నవంబర్ 9, శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్‌ లోథిలో ఉన్న బేర్ సాహిబ్‌ గురుద్వారాను సందర్శించారు. అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవంలో భాగంగా, ప్రధాని మోదీ ముందుగా గురుద్వారాలో పూజలు చేశారు. గురుదాస్‌పూర్‌లో డేరాబాబా నానక్‌ వద్ద కర్తార్‌పూర్‌ కారిడార్‌ ను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోదీకి ఈ రోజు ఉదయం విమానాశ్రయంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఘనంగా స్వాగతం పలికారు.

పాకిస్తాన్‌లోని నరోవల్‌ జిల్లా కర్తార్‌పూర్‌లోని ఉన్న దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను మరియు భారత్‌లోని డేరాబాబా నానక్‌ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ను భారత్ భూభాగం వైపున ప్రధాని మోదీ ప్రారంభించనుండగా, పాకిస్తాన్ వైపున ఉన్న కారిడార్‌ను ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రారంభిస్తారు. శనివారం నాడు ప్రధాని మోదీ ఈ కారిడార్ ప్రారంభించి, మొదటి యాత్రికుల బృందానికి కు జెండా ఊపుతారు. దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారా సందర్శనకు వెళ్లడానికి భారత పర్యాటకులకు వీసా అవసరం లేదు, అదేవిధంగా గురునానక్‌ జయంతి రోజున వెళ్లే భారత యాత్రికులు ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − twelve =