రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, సెప్టెంబర్ 5 నుంచి భారతదేశ వ్యాప్తంగా జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తునట్టు చెప్పారు. జియో ఫైబర్ సేవలకు టారిఫ్ రూ. 700 నుండి రూ. 10,000 వరకు ఉంటుందని చెప్పారు. దాదాపు 1600 నగరాల్లోని 2 కోట్ల నివాసాలు, 1.5 వాణిజ్య సముదాయాలకు జియో ఫైబర్ సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకే కనెక్షన్ తో ల్యాండ్ లైన్, డీటీహెచ్, ఇంటర్నెట్ సేవలు పొందవచ్చని తెలిపారు. 2020 జనవరి 1 నుంచి జియో కమర్షియల్ ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
జియో ఫైబర్ వివరాలు:
- జియో ఫైబర్ ప్లాన్స్ ధరలు రూ.700-10,000ల మధ్య ఉంటాయి.
- 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ వరకు స్పీడ్ ఉంటుంది
- ల్యాండ్ లైన్ ఫోన్ , డీటీహెచ్ సెట్టాప్ బాక్స్ ఫ్రీగా ఇస్తారు
- జియో ఫైబర్ ద్వారా దేశంలో ఏ నెటవర్క్ కి అయినా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు
- రూ .500 ప్లాన్ తో వినియోగదారులు విదేశాలకు అపరిమిత కాలింగ్ చేయవచ్చు
- 2020 మధ్యనుంచి జియో ఫస్ట్ డే ఫస్ట్ షో సేవలు అందుబాటులోకి తెస్తున్నారు, విడుదలైన రోజే ఇంటి నుంచి సినిమాలు చూసే అవకాశం
- సెట్టాప్ బాక్స్ ద్వారా ఏ ప్రాంతానికైనా ఉచిత వీడియో కాల్స్ చేసుకునే అవకాశం
- ప్రారంభ ఆఫర్ కింద ఎప్పటికి వార్షిక ప్లాన్స్ తీసుకునే జియో ఫైబర్ వినియోగదారులు హెచ్డీ/4కే ఎల్ఈడీ టీవీ మరియు సెట్టాప్ బాక్స్ ఉచితంగా పొందవచ్చు.
[subscribe]
[youtube_video videoid=95Llx1I6slA]