హైదరాబాద్ నగరశివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర ప్రాంగణంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2023, ఫిబ్రవరి 11వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు సమతా మూర్తి స్ఫూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రంలో విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం (భగవద్గీత పారాయణం) కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సకల లోక గురుడికి, సర్వ వేద విదుడికి, వేదాంత వీధీ విహారికి, బ్రహ్మ విద్యా ప్రదాతకి, అర్జున సారథికి వినయంతో, విశ్వాసంతో, కృతజ్ఞతతో సమర్పించే విశ్వ శాంతి విరాట్ గీతా పారాయణ కార్యక్రమాన్ని రామానుజుల వారి సన్నిధిలో శ్రీ చినజీయర్ స్వామి నేతృత్వంలో ఘనంగా నిర్వహించనున్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో, లక్షమందితో పెద్ద ఎత్తులో సామూహిక భగవద్గీత పారాయణం జరగనుంది. మన సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించి, జీవితాలను సుఖమయం చేసుకొనే ఒక గొప్ప వరమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జీవితాన్ని సఫలం చేసుకునేలా విశ్వ శాంతి విరాట్ గీతా పారాయణంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
శ్రీ చినజీయర్ స్వామి మాట్లాడుతూ, మనజాతికి గౌరవాన్ని, మన చరిత్రకు మహత్వాన్ని అందించినటువంటి మరియు మానవుడు యొక్క చరిత్రను, మానవుడు యొక్క ప్రవృత్తిని సంస్కరించేటటువంటి అద్భుత ప్రబంధం ‘భగవద్గీత’ అని అన్నారు. దానిని అందరం కలసి లక్ష గళాలతోటి రామానుజుల వారి సన్నిధిలో విన్నపిద్దామని, అందరం కలసి ఈ అద్భుతమైన మహోత్సవాన్ని జరుపుకుందాం, వచ్చి పాల్గొనండి అని పేర్కొన్నారు. మరోవైపు ఫిబ్రవరి 11, శనివారం ఉదయం 9 గంటల నుంచి రథోత్సవం, నిత్యా పూర్ణావుతి అనంతరం విరజా పుష్కరిణిలో చక్రస్నానం వంటి కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE