ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి జె.కృష్ణకిశోర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రజాధనం దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై కృష్ణకిశోర్తోపాటు, పే అండ్ అకౌంట్స్ విభాగానికి చెందిన అకౌంట్స్ అధికారి శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ డిసెంబర్ 12, గురువారం నాడు ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా కృష్ణ కిశోర్ పనిచేశారు. ఈ నేపథ్యంలో నిధుల దుర్వినియోగంలో వీరిద్దరి పాత్రపై పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాణిజ్య శాఖ ప్రభుత్వానికి వేర్వేరుగా నివేదికలు సమర్పించిగా, వాటిని పరిశీలించిన అనంతరం సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రకటించింది. వీరిపై నమోదైన అభియోగాలపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఏసీబీ, సీఐడీ లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ దర్యాప్తు పక్రియను ఆరు నెలల్లోగా పూర్తిచేయాలని, అప్పటివరకు ప్రభుత్వ అనుమతి లేకుండా కృష్ణకిశోర్, శ్రీనివాసరావులు అమరావతి విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
[subscribe]
CM YS Jagan Sensational Comments On Nara Lokesh Over Assaulting Marshalls | AP Assembly Session 2019
06:52
Buggana Rajendranath Shows The Video Footage Of Marshalls Blocking TDP Leaders | AP Assembly 2019
13:34
Buggana Rajendranath Fires On TDP Leaders Over Assault On Marshalls | AP Assembly 2019 | Mango News
06:22
Chandrababu Naidu Agreed Over Shouting On Marshalls | AP Assembly Winter Session 2019 | Mango News
04:00