టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో పాటు తన సేవా కార్యక్రమాలతో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చిరు, భారీ హిట్ “వాల్తేరు వీరయ్య” తర్వాత “బోళా శంకర్”లో నటించినా, ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఆయన అభిమానులంతా ఇప్పుడు ఎంతో ఆసక్తిగా “విశ్వంభర” సినిమాపై దృష్టి పెట్టారు. ఈ సినిమాలో త్రిష ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, మరో హీరోయిన్గా ఆషికా రంగనాథ్ కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా రంగంలో చిరంజీవి నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రయాణం ఎంతో గొప్పది. తన అద్భుతమైన నటనతోనే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ – పార్లమెంట్లో చిరంజీవికి గౌరవ సత్కారం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు నవేందు మిశ్రా నిర్వహించారు.
మార్చి 19న జరిగిన ఈ వేడుకకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవిని కల్చరల్ లీడర్షిప్ పురస్కారంతో సత్కరించింది. సినిమా, ప్రజాసేవ, దాతృత్వ రంగాల్లో చిరంజీవి చేసిన కృషికి గానూ ఈ అవార్డు ఆయనకు అందజేయబడింది. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ వంటి పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిరంజీవికి అభినందనలు తెలిపారు.
ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న చిరంజీవి మరోసారి తన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ సేవలకు, ప్రజాసంకల్పానికి ఈ గౌరవం ప్రతిబింబంగా నిలిచిందని అభిమానులు భావిస్తున్నారు.
#Chiranjeevi – EMPEROR🫡
Proudest moment for the #Telugu speaking bastion! 🌟🌟🌟
Last night, #MegaStarChiranjeevi became the 1st Indian Celebrity to receive the prestigious “Lifetime Achievement Award” from the British Government at the #UK parliament here in #London !… pic.twitter.com/Pnsp2ewsUa
— FILMOVIEW (@FILMOVIEW_) March 20, 2025