కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర: కేరళలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర, 7 రోజుల్లో 100 కి.మీ పూర్తి

Congress Bharat Jodo Yatra Rahul Gandhi Completes 100 km Padayatra on 7th Day in Kerala Today, Rahul Gandhi Completes 100 km Padayatra , Congress Bharat Jodo Yatra in Kerala, Bharat Jodo Yatra, Congress Bharat Jodo Yatra , Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Bharat Jodo Yatra, Mango News, Mango News Telugu, Tamil Nadu Rajasthan and Chhattisgarh CM Attended, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi , Rajiv Gandhi, Priyanka Gandhi, Sonia Gandhi, Rahul Gandhi Latest News And Updates

కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఏడో రోజుకు చేరుకుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని పార్టీ నేతలు మంగళవారం కనియాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో రాహుల్ పాదయాత్ర 100 కి.మీ పూర్తి చేసుకుంది. కేరళలో మొత్తం 17 రోజుల పాటు జరుగనున్న ఈ యాత్ర మంగళవారం మూడో రోజు కొనసాగుతోంది. దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ఒక సందేశం ఉంచారు. ‘భారతదేశంలోని ప్రజల యొక్క కలలను నెరవేర్చడానికి మేము దేశాన్ని ఏకతాటిపై నిలిపేందుకు అన్ని రాష్ట్రాలనూ కలుపుకుంటూ పయనిస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా తొలి 100 కి.మీ దూరం పూర్తయింది. మరెంతో దూరం ఎదురు చూస్తోంది’ అని రాహుల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా కేరళలో భారీ వర్షంలోనూ ప్రజల నుంచి రాహుల్ యాత్రకు మంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజలతో ఆయన మమేకమవుతున్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్లు, 150 రోజుల పాటు కొనసాగనున్న ఈ పాదయాత్ర మొత్తం 12 రాష్ట్రాలగుండా పయనించనుంది. ఇక ఈ యాత్ర సెప్టెంబర్ 30న కేరళ నుండి కర్నాటకకు చేరుకుంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY