వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తరహాలో వందే మెట్రో

Vande Metro To Be Launched On The Lines Of Vande Bharat Express, Vande Metro To Be Launched, Vande Metro, Vande Bharat Express, Vande Metro Proposal, Indian Railways Launched Vande Metro, Vande Bharat Metro Train, Indian Railway, Vande Bharat, BJP, India, Modi, Breaking News, Latest News, Political News, Mango News, Mango News Telugu

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇప్పుడు కేంద్ర రైల్వే శాఖ వందే భారత్‌ మెట్రో (వందే మెట్రో) ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పటికే ఈ మెట్రో రైళ్లు సిద్ధమై ట్రయల్ రన్ నడుస్తున్నాయి. త్వరలో ఇవి ప్రయాణికుల సేవలకు అందుబాటులోకి రానున్నాయి. వందే మెట్రో అంటే వందే భారత్ రైళ్లు మన మెట్రో మార్గంలో తిరుగుతాయి. ఈ వందే మెట్రో రైలు ప్రస్తుతం ప్రధాన నగరాల నుండి చుట్టుపక్కల నగరాలకు తిరుగుతున్న MEMU రైళ్ల స్థానంలో నడుస్తుంది. దీని ద్వారా రెండు నగరాల మధ్య అత్యంత వేగంతో సౌకర్యవంతమైన ప్రయాణికులకు అద్భుత అనుభూతిని అందించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు వందే మెట్రో మధ్య తేడా
ప్రయాణ దూరం – వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నగరాల మధ్య 500 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ప్రయాణిస్తుంది. వందే మెట్రో రైళ్లు దాదాపు 100-200 కి.మీ.ల పరిధిలో తిరుగుతాయి.
వేగం – వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 130 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. వందే మెట్రో రైలు గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
ఇంటీరియర్ డిజైన్ – వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సౌకర్యవంతమైన సీటింగ్ అమరిక ఉంటుంది. వందే మెట్రోలో కూర్చునేందుకు, నిలబడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వందే మెట్రో మేకోవర్‌తో కూడిన MEMU నిర్మాణాన్ని కలిగి ఉంది.
ఆహార సౌకర్యం – వందే భారత్ రైళ్లలో భోజనం సౌకర్యం ఉంటుంది. ప్రయాణీకులకు టికెట్ మొత్తంలో భోజనం మరియు అల్పాహారం సౌకర్యం కల్పిస్తారు. ఈ రైలులో ప్యాంట్రీ వాన్ సౌకర్యం లేదు.
టికెటింగ్ సౌకర్యం – ఆన్‌లైన్ బుకింగ్ మాత్రమే అందుబాటులో ఉంది. వందే మెట్రోలో కౌంటర్ టికెటింగ్ కూడా చేసుకోవచ్చు.
ట్రాఫిక్ పీరియడ్ – వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాత్ర కూడా సెవలు అందిస్తాయి కాని వందే మెట్రోలో అర్థరాత్ తరువాత సేవలు నిలిపివేయబడుతాయి.

చెన్నై ట్రయల్ రన్
వందే మెట్రో రైలు గత శనివారం చెన్నై బీచ్-కాట్పాడి మార్గంలో మొదటి ట్రయల్ రన్ పూర్తి చేసింది. చెన్నై బీచ్ స్టేషన్ నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరిన మెట్రో 11.55 గంటలకు కాట్పాడికి చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం 12.15 గంటలకు బయలుదేరి 2 గంటలకు చెన్నై బీచ్ స్టేషన్‌కు చేరుకుంది. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు సుమారు 100 మంది ప్రయాణికులు మరియు 200 మంది నిలుచుని ప్రయాణీకుల సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కోచ్‌లలో ఆటోమేటిక్ డోర్లు మరియు ఆధునిక టెక్నాలజీని వాడారు.

ఎక్కడ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది?
వందే మెట్రో యొక్క మొదటి సర్వీస్ ముంబై సబర్బన్ రైల్వే లైన్‌లో ప్రారంభమవుతుంది.
లక్నో – కాన్పూర్
చెన్నై – తిరుపతి
ఆగ్రా – మధుర
భువనేశ్వర్ – బాలాసోర్
ఢిల్లీ – రేవారీ,