వింటర్ దాటి సమ్మర్ ఎంటర్ అవడంతో.. చాలామంది దగ్గు, గొంతు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. నిజానికి గొంతులో గరగరగా ఉందంటే… మన శరీరంలోకి ఏవో బ్యాక్టీరియా ఉందనీ, వాటిపై మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పోరాడుతోందని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ గొంతు గరగరకు మనం చెక్ పెట్టే ప్రయత్నం చేయాలని వైద్యులు చెబుతున్నారు.
వ్యాధి నిరోధక శక్తి ఓడిపోతున్నప్పుడు మ్యూకస్ అంటే కఫం లేదా శ్లేష్మం ఏర్పడుతుంది. అది గొంతుకు అడ్డం పడుతుంది. జలుబు, జ్వరం, అలెర్జీలు, కాలుష్యం, పొగ వంటివి గొంతు గరగరకు దారితీస్తాయి. ఈ కఫానికి ఆరంభంలోనే చెక్ పెట్టాలి. లేదంటే అది దగ్గును క్రియేట్ చేస్తుంది. ఆ దగ్గు రెండు వారాల కంటే ఎక్కువసేపు ఉంటే… ప్రాణాంతకమైన క్షయ వచ్చే ప్రమాదం ఉంటుంది.
గోరు వెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపు వేసి… కలిపి తాగాలి. కావాలంటే కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. గొంతులో గరగర మాయమవ్వడమే కాదు. గొంతులో హాయిగా అనిపిస్తుంది .కొన్ని చామంతి పువ్వుల రేకుల్ని నీటిలో వేసి… మరిగించి తాగాలి. కావాలంటే కాస్త తేనె కలుపుకోవచ్చు. ఈ చామంతి టీ బ్యాక్టీరియాను బయటకు పంపేయడంలో ది బెస్ట్ అంటారు.
అల్లం పేస్ట్ కు, దాల్చిన చెక్కను పొడిని యాడ్ చేసి వాటితో టీపొడి కలిపి టీ పెట్టుకొని తాగేయండి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే తప్పకుండా చక్కని ఫలితం కనిపిస్తుంది. కావాలంటే కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు.
అల్లంలో బ్యాక్టీరియాలను చంపే గుణాలున్నాయి. గొంతులో మంటను తగ్గించే లక్షణాలున్నాయి. కాబట్టి… అల్లాన్ని మెత్తగా నూరి… టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగితే ఉంటుంది చూడండి… గొంతులో కిచ్ కిచ్ కు రిలీఫ్ దొరుకుతుంది.
పుదీనా చేసే మేలేంటో ఆల్రెడీ చాలామందికి తెలుసు. పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి… ఆకులు తీసివేసి… వాటర్ తాగాలి. ఒకవేళ పుదీనా ఆకులు లేకపోతే తులసి ఆకులతో ఇలా ట్రై చేసినా మంచి ఫలితం ఉంటుంది.