ప్రతి ఒకరి వంటింట్లోను యాలకులు తప్పనిసరిగా ఉంటాయి. సాధారణంగా యాలకులను మసాలా వంటకాలలో, టీలోనూ మంచి ఫ్లేవర్ కోసం.. సువాసన కోసం వినియోగిస్తుంటారు. యాలకులు ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తాయని..యాలకుల వాటర్ మంచి డీటాక్స్ డ్రింక్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రెండు యాలకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగడం వల్ల శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించి.. మానసిక ప్రశాంతతను కలిగిస్తుందట. చాలామంది ఉదయం కాఫీ లేదా టీ తాగుతుంటారు. అయితే దానికి బదులు ఖాళీ కడుపుతో యాలకుల నీటిని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియను మెరుగుపడటంతో పాటు..మలబద్ధకం, గుండెల్లో మంట, అజీర్ణం వంటివి రాకుండా ఉంటాయి.
ఇలాచీవాటర్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తాయి. ఇది బ్యాక్టీరియాను చంపడం ద్వారా నోటిని ఫ్రెష్ గా ఉంచుతుంది. అంతేకాదు..ఉదయం ఖాళీ కడుపుతో యాలకుల నీటిని తాగడం వల్ల శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు నీటిని బయటకు వెళ్లిపోతాయి. దీంతో శరీరాన్ని శుభ్రపరచడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ నీళ్లు సహాయపడతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను యాలకులలోని గుణాలు సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ నీళ్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరం నుంచి విషపదార్ధాలను తొలగించడంలో సహాయపడుతాయి. ఇాలాచీ వాటర్ మూత్రపిండాలు, కాలేయాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను కూడా అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
తాజా యాలకులలో ఎక్కువ శాతం ఫైబర్, ఇనుము, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అనేక యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరం నుంచి విష పదార్ధాలను తొలగించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
బరువు తగ్గాలనుకున్నావారు కూడా ఉదయాన్నే ఖాళీ కడపుతో యాలకుల నీరు తాగితే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు నిపుణులు. ఇలాచీ వాటర్ జీవక్రియను పెంచుతుంది. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కాల్చడంలో సహాయపడుతాయి. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలోని మెటబాలిజం మెరుగై, అదనపు క్యాలరీలను కరిగించి, శరీర బరువులో త్వరగా మార్పు వస్తుందని నిపుణులు అంటున్నారు.