భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 22 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్, ఫిబ్రవరి 6 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్లో జరిగే తొలి టీ20తో సిరీస్కు మొదలవుతుంది. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్గా, రోహిత్ శర్మ వన్డే కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, ఇంగ్లాండ్ జట్టుకు జోస్ బట్లర్ నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్లో ఇరు జట్లు తమ బలాబలాలను పరీక్షించుకోనుండటంతో క్రికెట్ ప్రేమికులలో భారీ ఆసక్తి నెలకొంది.
టీ20 సిరీస్ షెడ్యూల్
తొలి టీ20 – జనవరి 22, కోల్కతా
రెండో టీ20 – జనవరి 25, చెన్నై
మూడో టీ20 – జనవరి 28, రాజ్కోట్
నాలుగో టీ20 – జనవరి 31, పూణె
ఐదవ టీ20 – ఫిబ్రవరి 2, ముంబై
వన్డే సిరీస్ షెడ్యూల్
మొదటి వన్డే – ఫిబ్రవరి 6, నాగ్పూర్
రెండో వన్డే – ఫిబ్రవరి 9, కటక్
మూడో వన్డే – ఫిబ్రవరి 12, అహ్మదాబాద్
టీ20 సిరీస్కు జట్లు
భారత జట్టు (టీ20):
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమ్మీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్.
ఇంగ్లండ్ జట్టు (టీ20):
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్, జాకబ్ బెటెల్, బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, సాకిబ్ మహమూద్.
వన్డే సిరీస్కు జట్లు
భారత జట్టు (వన్డే):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, యస్సవి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ఇంగ్లండ్ జట్టు (వన్డే):
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్, బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, గస్ అట్కిన్సన్.
చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మూడేళ్ల తర్వాత టీ20 మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 24 టీ20 మ్యాచ్లలో భారత్ 13 విజయాలు సాధించగా, ఇంగ్లాండ్ 11 విజయాలు అందుకుంది. భారత యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి తదితరులు కీలక పాత్ర పోషించనున్నారు.
🚨 England Cricket Team have Reached India for the 5 T20s and 3 ODIs.#INDvsENG pic.twitter.com/OPoiem5GYg
— Sheeza Khan (@Pmln_gulf92) January 18, 2025