ముగిసిన విశ్వ క్రీడలు..

India Won Six Medals At The Paris Olympics, Six Medals At The Paris Olympics, Paris Olympics India Medals, India Medals, Six Medals, India Won Six Medals, India Won The Paris Olympics, Paris Olympics, Paris Olympics 2024 LIVE Updates, Paris Olympics 2024, Wrestling, Paris Olympics, Olympics Live Updates, Latest Olympics News, India, Sports, Live Updates, Mango News, Mango News Telugu

మూడు వారాలుగా ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన పారిస్‌ ఒలింపిక్స్‌కు తెరపడింది. పదివేలకు పైగా అథ్లెట్లు, 32 క్రీడలు, 329 క్రీడాంశాలతో 17 రోజుల పాటు క్రీడా ప్రపంచాన్ని మునివేళ్లపై కూర్చోబెట్టిన ఆటలు ఘనంగా ముగిశాయి. పతకాల పట్టికలో అగ్రస్థానం కోసం ఎప్పటిలాగే అమెరికా, చైనా టాప్ లో నిలవగా.. పలు దేశాలు బోణీ కూడా కొట్టకుండానే వెనుదిరిగాయి. 117 మంది భారీ బృందంతో పారిస్‌కు వెళ్లిన భారత్‌ ఈసారి రెండంకెల పతకాల’ కలను నెరవేర్చుకోకుండానే స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. ఇక తర్వాతి ఒలింపిక్స్‌లో 2028లో లాస్‌ ఏంజెల్స్‌ నగరం విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వనుంది.

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 5 కాంస్య పతకాలు, మరో రజత పతకంతో సహా మొత్తం 6 పతకాలతో భారత్ తన ఒలింపిక్స్ ప్రచారాన్ని ముగించింది. గత 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తన ఆల్ టైమ్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించగా, వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజతం సాధించగా, నాలుగు ఈవెంట్లలో కాంస్యం గెలిచిన భారత్ మొత్తం 7 పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చింది. 120 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే గొప్ప విజయం.

ఇప్పుడు పారిస్ కోర్టులో ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు భారతీయులకు అన్ని అవకాశాలు లభించాయి. 5 కాంస్య పతకాలు సాధించింది. అంతేకాకుండా వివిధ పోటీల్లో భారతీయులు 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాలుగో స్థానం పొందడం అంత ఈజీ కాదు. కానీ భారత్ అక్కడ వెంట్రుక వాసి తేడాతో పతకాన్ని కోల్పోయింది. ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో భారత్‌ రెండంకెల స్కోరు సాధించే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికి అదృష్టం కలిసి రాలేదు. అయినప్పటికీ, అథ్లెట్ల సామర్థ్యం వారి ప్రదర్శన మెరుగుపడటం శుభపరిణామం. సమ్మర్ ఒలింపిక్స్ తదుపరి ఎడిషన్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరగనుంది. పారిస్ ప్రాంగణంలో భారతీయులు ఇచ్చిన అనేక ధైర్య పోరాటాలు రాబోయే రోజుల పోటీలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.

వినేష్ ఫోగట్ షాకింగ్ ఫైనల్
మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో వినేష్ ఫోగట్ ఫైనల్స్‌కు ముందు అనర్హతకు గురికావడం వివాదస్పదమయింది. ఈ పోటీలో టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్‌తో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన వినేష్.. ఆ తర్వాత జరిగిన క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచ్‌ల్లో మాజీ, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. అనర్హత కారణంగా కనీసం రజత పతకాన్ని కూడా వినేష్ దక్కించుకోలేకపోయింది. వినేష్‌కు జరిగిన అన్యాయంపై అంతర్జాతీయ క్రీడా కోర్టులో అప్పీల్ దాఖలైంది. అయితే నిబంధనల ప్రకారం వినేష్ పతకం కోల్పోయినందున భారత న్యాయవాది కోరిన ఉమ్మడి రజత పతకాన్ని కోర్టు మంజూరు చేయడం అనుమానమే. తుది తీర్పు ఆగస్టు 13న రానుంది.

షూటర్ మను భాకర్ రికార్డులు
పారిస్‌ వేదికగా భారత మహిళా షూటర్‌ మను భాకర్‌ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత 10మీ ఎయిర్ పిస్టల్ మరియు మిక్స్‌డ్ 10మీ. ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో కాంస్య పతకం సాధించి, ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు
రజత పతకం – నీరజ్ చోప్రా – అథ్లెటిక్స్ – పురుషుల జావెలిన్ త్రో
కాంస్య పతకం – మను భాకర్ – షూటింగ్ – మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్
కాంస్య పతకం – మను భాకర్/సరబ్జోత్ సింగ్ – షూటింగ్ – మిక్స్‌డ్ 10మీ. ఎయిర్ పిస్టల్
కాంస్య పతకం – స్వప్నిల్ కుసాలే – షూటింగ్ – 50 మీ. రైఫిల్ 3 పొజిషన్
కాంస్య పతకం – భారత హాకీ జట్టు – ఫీల్డ్ హాకీ – భారత పురుషుల హాకీ జట్టు
కాంస్య పతకం – అమన్ సెహ్రావత్ – రెజ్లింగ్ – పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్