వైజాగ్‌ మెట్రో రైలు: మొదటి దశ డీపీఆర్ కు ప్రభుత్వం ఆమోదం.. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కాం లభించేనా?

Visakha Metro Rail A Solution To Traffic Woes In Vizag, Traffic Woes In Vizag, Vizag Traffic, Visakha Metro Rail, Vizag Metro, Metro Rail Project, Traffic Solutions In Vizag, Urban Infrastructure In AP, Visakhapatnam Development, Vizag Metro Rail Updates, Andhra Pradesh, AP Live Updates, AP Politics, Political News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

విశాఖపట్నం నగరాన్ని మెట్రో రైలు సేవలు మరింత ఆధునిక నగరంగా తీర్చిదిద్దనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో విజయవంతంగా అమలవుతున్న మెట్రో ప్రాజెక్టు మాదిరిగా, వైజాగ్ ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ఏపీ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించేందుకు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ప్రక్రియ వేగంగా అమలవుతుండటంతో, నగర వాసులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెట్రో రైలు ప్రాజెక్టు ముఖ్యాంశాలు:

మొత్తం 46.23 కి.మీ. దూరం లోపల మూడు కారిడార్లను రూపొందిస్తున్నారు.
మొత్తం 42 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు వ్యయం రూ.11,498 కోట్లు కావచ్చు అని అంచనా.

ముఖ్యమైన కారిడార్లు:

కారిడార్-1: స్టీల్‌ప్లాంటు – కొమ్మాది (27.65 కి.మీ.)
కారిడార్-2: గురుద్వారా – పాత పోస్టాఫీసు (5.08 కి.మీ.)
కారిడార్-3: తాటిచెట్లపాలెం – చినవాల్తేరు (6.75 కి.మీ.)

భూమి సమీకరణ, ప్రణాళికలు, మరియు మౌలిక నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ మార్పులను కేంద్రానికి సమర్పించినట్లు అధికారులు తెలిపారు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో రైలు విశాఖపట్నం నగరానికి మెరుగైన రవాణా ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు.