ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేశారు. శుక్రవారం మదురై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన రాత్రి 7.25 గంటల సమయంలో విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగకు చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కంచర్లపాలెం, ఓల్డ్ ఐటీవో మధ్య దారిలో ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఆ తర్వాత ఆయన ఐఎన్ఎస్ చోళకు చేరుకొని, ముందుగా బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో భేటీ కానున్నారు. అలాగే ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానుండటం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఇక శుక్రవారం రాత్రికి ఐఎన్ఎస్ చోళలో ప్రధాని మోదీ బస చేయనున్నారు.
ఇక శనివారం ఉదయం 10.30 గంటలకు ఆంధ్రాయూనివర్సిటీ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సభనుంచే ప్రధాని మోదీ రూ.15,233 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సభలో ప్రధానితో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా పాల్గొననున్నారు. మరోవైపు విశాఖలో ప్రధాని మోదీ సభ కోసం ఇప్పటికే విస్తృత చేశారు. ఈ సభకు మూడు లక్షల మంది ప్రజలు హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి సీఎం జగన్ సహా ఏపీ కేబినెట్ మంత్రులు హాజరుకానున్నారు. అలాగే దాదాపు 10000 మంది కేంద్ర, రాష్ట్ర బలగాలతో విశాఖలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా విశాఖలో సభ అనంతరం ప్రధాని మోదీ విశాఖ విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి తెలంగాణలోని రామగుండం పర్యటనకు వెళ్లనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE