ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: రైతులకు, విద్యార్థులకు డబుల్ బెనిఫిట్స్!

AP Cabinet Announces Key Decisions Double Benefits For Farmers And Students, AP Cabinet Announces Key Decisions, Double Benefits For Farmers And Students, Benefits For Farmers, AP Cabinet Key Decisions, Amaravati Development, AP Cabinet, Farmer Welfare, Investment Approvals, PM Modi Visit, Andhra Pradesh, AP Live Updates, AP Politics, Political News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక అంశాలను ఆమోదించింది. మొత్తం 14 అంశాలపై చర్చ జరిపిన కేబినెట్, వాటికి అనుమతి ఇచ్చింది. జనవరి 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయడం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దిశానిర్దేశం ఇచ్చారు.

ఏపీ కేబినెట్‌లో 14 కీలక నిర్ణయాలు
అమ్మ ఒడి పునఃప్రారంభం: వచ్చే అకడమిక్‌ ఇయర్‌ నుంచి అమ్మ ఒడి పథకానికి గ్రీన్ సిగ్నల్.
రైతులకు మద్దతు:కేంద్రం ఇస్తున్న రూ.10 వేల సాయంతో పాటు, ఏపీ ప్రభుత్వం అదనంగా మరో రూ.10 వేలు అందజేయనున్నది.
మత్స్యకారుల కోసం: ఫిషింగ్ హాలిడే సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం.
అమరావతిలో అభివృద్ధి ప్రాజెక్టులు: రాజధాని అమరావతిలో రూ.2,733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం. ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులు.
హెల్త్ సెక్టార్ అభివృద్ధి: తిరుపతి ఈఎస్‌ఐ ఆస్పత్రిని 50 నుంచి 100 పడకల సామర్థ్యానికి పెంపు.
గుంటూరు జిల్లాలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయింపు.
పెట్టుబడులు: రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం. రామయ్యపట్నంలో రూ.96,862 కోట్లతో బీపీసీఎల్ భారీ రిఫైనరీకి గ్రీన్ సిగ్నల్. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు రూ.83 వేల కోట్ల పెట్టుబడులు.
విశాఖపట్నం అభివృద్ధి: మిలీనియం టవర్స్‌లో టీసీఎస్ రూ.80 కోట్ల పెట్టుబడులతో విస్తరణ.
వాహన తయారీ పరిశ్రమలు: గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ రూ.1,046 కోట్లతో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్. అనకాపల్లిలో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబడులు.
ప్రధాని మోదీ పర్యటన: జనవరి 8న ప్రధాని మోదీ వైజాగ్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.
నదుల అనుసంధానం: గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌పై చర్చ.