దుబాయ్‌లో సీఎం చంద్రబాబుకి ఘనస్వాగతం

AP CM Chandrababu Naidu Receives Grand Welcome in Dubai

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న నాలుగు రోజుల దుబాయ్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది.

ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు యూఏఈ (UAE)లోని భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, అలాగే పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు, ఎన్నారై (NRI) నాయకులు విమానాశ్రయానికి చేరుకున్నారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినాదాలతో విమానాశ్రయం ప్రాంగణం సందడిగా మారింది.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా వివిధ అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల ప్రతినిధులతో మరియు పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆయన రేపు (శుక్రవారం) ‘ప్రవాసాంధ్ర భరోసా’ అనే కీలక పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here