రష్యా నుండి ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేసిన ఇండియన్ రిఫైనరీలు

Indian Refineries Suspend Oil Purchases From Russia Amid US Sanctions Clarity Wait

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా భారతీయ చమురు రిఫైనరీలు రష్యా నుంచి కొత్త ముడి చమురు కొనుగోలు ఆర్డర్లను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ ఆంక్షలపై మరింత స్పష్టత వచ్చేవరకు వేచిచూసే వైఖరిని అనుసరిస్తున్నట్లు రిఫైనరీలకు చెందిన కీలక వ్యక్తులు వెల్లడించారు.

ముఖ్యంగా, అక్టోబరు 22న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, లుకాయిల్ సంస్థల నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షలు విధించారు. అమెరికాయేతర సంస్థలు సైతం ఈ సంస్థల నుంచి చమురు కొనుగోలు చేస్తే పెనాల్టీలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా, నవంబర్ 21 నాటికి ఆయా సంస్థలతో ప్రస్తుతం కొనసాగుతున్న లావాదేవీలన్నీ ముగించాలని ఆదేశించారు.

భారతదేశం ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న మొత్తం ముడి చమురులో మూడో వంతు రష్యా నుంచే వస్తోంది. రోజుకు సగటున 1.7 మిలియన్ బారెళ్ల (ఎంపీడీ) దిగుమతుల్లో 1.2 ఎంపీడీ కేవలం ఈ రెండు సంస్థల నుంచే వస్తుండటం గమనార్హం. వీటిలో రిలయన్స్, నయారా వంటి ప్రైవేటు సంస్థలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. ఆంక్షల ప్రభావం ఉన్న నేపథ్యంలో, ఈ లోటును పూడ్చుకునేందుకు భారతీయ కంపెనీలు స్పాట్ మార్కెట్లతో పాటు పశ్చిమాసియా వైపు దృష్టి సారించాయి.

అమెరికా ఆంక్షల నియంత్రణ చట్టాలకు తాము కట్టుబడి ఉంటామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఈ పరిణామాల మధ్య, భారత రిఫైనరీలు అమెరికా కంపెనీల నుంచి చమురు బుకింగ్‌లను పెంచుకోవడం, అమెరికాకు సహకరిస్తామనే సంకేతాలను ఇవ్వడానికి జరుగుతున్నట్లుగా వాణిజ్య మరియు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here