భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. కాగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 97 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,567 కరోనా కేసులు, 385 మరణాలు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 97,03,770 కు, మరణాల సంఖ్య 1,40,958 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 3,83,866 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు
మరోవైపు కొత్తగా 39,045 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 91,78,946 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 94.59 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ఇక డిసెంబర్ 7 నాటికీ దేశంలో14,88,14,055 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 10,26,399 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ