ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, భువనేశ్వరి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రధానంగా ‘హెరిటేజ్ ఫుడ్స్’ సంస్థకు అందిస్తున్న సేవలు మరియు ఆమె చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అంతర్జాతీయ గౌరవాన్ని అందించారు. దీనిలో భాగంగా రెండు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నారు. ఇక తన సతీమణికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కడం పట్ల సీఎం చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Absolutely proud of my wife, Bhuvaneswari, who has been honoured with two prestigious awards in London today. The first, the IOD Distinguished Fellow Award, recognises her remarkable contribution to public service, business leadership, and society. The second, the Golden Peacock… pic.twitter.com/AliawhIVfn
— N Chandrababu Naidu (@ncbn) November 4, 2025
ఈ మేరకు సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా.. “ఈరోజు లండన్లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించబడిన నా భార్య భువనేశ్వరి పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. మొదటిది, ‘IOD డిస్టింగుష్డ్ ఫెలో అవార్డు’, ప్రజా సేవ, వ్యాపార నాయకత్వం మరియు సమాజానికి ఆమె చేసిన విశేష కృషిని గుర్తిస్తుంది. రెండవది, ‘గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ 2025’, నైతిక పాలన మరియు కార్పొరేట్ ఎక్సలెన్స్ పట్ల దాని అచంచలమైన నిబద్ధతకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్కు ప్రదానం చేయబడింది.” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన ఇలా అన్నారు.. “భువనేశ్వరి కేవలం ఒక వ్యవస్థాపకురాలు మరియు పరోపకారి మాత్రమే కాదు. ఆమె విలువలు, కరుణ మరియు నాయకత్వం ద్వారా భారతీయ మరియు తెలుగు వారసత్వంలోని ఉత్తమతను నిలబెట్టే తెలుగు సంస్కృతికి గర్వించదగిన ప్రతినిధి. ఆమె ప్రయాణం తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తూనే ఉంది మరియు ఈ గుర్తింపులు ఆమె దృష్టి, అంకితభావం మరియు హృదయాన్ని అందంగా ప్రతిబింబిస్తాయి. టీమ్ హెరిటేజ్ మరియు టీమ్ NTR ట్రస్ట్ వారి ఉమ్మడి విజయానికి నా హృదయపూర్వక అభినందనలు.” అని తెలిపారు.
ఇదిలావుంటే, చంద్రబాబు-భువనేశ్వరిల తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు.. “ఈరోజు నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నా తల్లి శ్రీమతి భువనేశ్వరి మరియు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రపంచ వేదికపై సత్కరించబడుతున్నాయి. అమ్మా, మీరు మా కుటుంబానికి స్ఫూర్తిదాయకమైన రోల్ మోడల్. 2025 సంవత్సరానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) యొక్క విశిష్ట ఫెలోగా మీరు ఎంపిక కావడం నైతిక నాయకత్వం, సుపరిపాలన మరియు సామాజిక ప్రభావం పట్ల మీ జీవితకాల నిబద్ధతను జరుపుకుంటుంది.”
“కార్పొరేట్ గవర్నెన్స్లో ఎక్సలెన్స్ కోసం గోల్డెన్ పీకాక్ అవార్డు 2025 గెలుచుకున్నందుకు హెరిటేజ్ ఫుడ్స్కు కూడా నా హృదయపూర్వక అభినందనలు. కఠినమైన 3-టైర్ మూల్యాంకనం ద్వారా 410 ప్రతిస్పందనలలో మరియు 175 షార్ట్లిస్ట్ చేయబడిన వాటిలో సెక్టార్ విజేతగా ఎదగడం నిజంగా ప్రశంసనీయం. ఇది సమగ్రత, ఆవిష్కరణ మరియు స్థిరమైన వాటాదారుల నమ్మకాన్ని ప్రతిబింబించే గర్వకారణమైన క్షణం.” అని ఆయన పేర్కొన్నారు.
I'm deeply thrilled and proud today. My mother, Smt. Bhuvaneswari, and Heritage Foods Ltd are being honoured on a global platform.
Amma, you've been an inspiring role model to our family. Your selection as a Distinguished Fellow of the Institute of Directors (IOD) for 2025… pic.twitter.com/BElBRN2saT
— Lokesh Nara (@naralokesh) November 4, 2025
ఇక భువనేశ్వరికి లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. తన నిబద్ధత, నాయకత్వ లక్షణాలు మరియు నిస్వార్థ సేవకు ఈ అంతర్జాతీయ అవార్డు ఒక గుర్తింపు. ఆమెకు ఈ గౌరవం దక్కడం ప్రతి తెలుగు మహిళకు గర్వకారణం అని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




































