ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 131 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 70 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 61 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 70 కేసులతో కలిపి మే 30, శనివారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2944 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 9,504 సాంపిల్స్ ని పరీక్షించగా 70 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూర్ జిల్లాలో ముగ్గురు కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చినట్టుగా పేర్కొన్నారు. ఇక ఈ వైరస్ వలన ఇప్పటివరకు రాష్ట్రంలో 60 మరణించారు.
ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 406 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 217 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటికి 111 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఈ 517 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 3,461 కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో 2092 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 55 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 792 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: as on 30/05/2020
Total Positive cases: 2944
Discharged: 2092
Deceased: 60
Active cases: 792#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Y16sZY3K6g— ArogyaAndhra (@ArogyaAndhra) May 30, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu















































































