ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ పార్టీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తయింది. ప్రధాని మోదీ ఏడాది పాలనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ” దేశం గడిచిన సంవత్సరంలో చారిత్రాత్మక మరియు మైలురాళ్ల వంటి నిర్ణయాలను చూసింది. భారతదేశం త్వరలోనే స్వయం ప్రతిపత్తి గల దేశంగా మారుతుంది. దార్శనిక మరియు సాహసోపేత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ 21వ శతాబ్దం కచ్చితంగా భారత్దే అవుతుందని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత సంవత్సర కాలంలో ధైర్యమైన మరియు విజయవంతమైన సంస్కరణల కోసం ప్రభుత్వంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
My Hearty Congratulations!! to everyone in the govt for 1 year of bold and successful reforms.
Jai Hind !— Pawan Kalyan (@PawanKalyan) May 30, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu