మొంథా తుఫాన్ ఫైటర్లను సత్కరించిన సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Felicitates Cyclone Montha Warriors With Certificates

మొంథా తుపాను ప్రభావాన్ని రాష్ట్రంపై తగ్గించడంలో అద్భుతంగా పనిచేసిన అధికారులను, సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించారు. తుపాను నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినవారి కోసం శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు అధికారులను ‘సైక్లోన్ మొంథా ఫైటర్లు’గా గౌరవిస్తూ వారికి సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందజేశారు. తుపాను వల్ల రాష్ట్రంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకున్నామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు.

సాంకేతికతతో సకాలంలో హెచ్చరికలు:

తుపానును ఎదుర్కోవడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి వివరించారు. “తుపానుపై సమాచారాన్ని ముందుగానే ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి, రియల్‌ టైమ్‌లోనే హెచ్చరికలు పంపాం. వర్ష ప్రభావం, గాలుల తీవ్రతను టెక్నాలజీతో పర్యవేక్షించడం ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలిగాం,” అని ఆయన తెలిపారు.

ఇక పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి కాపాడిన ఘటనను, వరద నీరు చుట్టుముట్టిన ప్రార్థనా మందిరం నుంచి 15 మందిని రక్షించిన ఉదంతాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. నివాస స్థలాలు మరియు పంట పొలాలలో వరద నీటిని తొలగించే పనులు కూడా వేగంగా జరిగాయని పేర్కొన్నారు.

అధికారుల కృషి, గత అనుభవాలు:

ఈ విజయం కేవలం సాంకేతికత వల్లనే కాక, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందించిన సహకారం వల్లే సాధ్యమైందని సీఎం అధికారుల బృందాన్ని అభినందించారు. రాష్ట్రం ఎదుర్కొనే రెండు సమస్యలలో ఒకటైన తుపాను నష్టాన్ని తగ్గించడంపై ఆయన దృష్టి పెట్టారు. రాష్ట్రానికి రాయలసీమ కరవు మరియు కోస్తాంధ్రకు తుపానులనే రెండు సమస్యలు ఉన్నాయి.

సమర్థ నీటి నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణంతో రాయలసీమలో కరవును అదుపులోకి తీసుకురాగలిగాం. ఈసారి మొంథా తుపానుపై అధికారులతో బృందాన్ని సిద్ధం చేసి, సాంకేతిక సపోర్ట్‌ను ఇవ్వడం ద్వారా అద్భుతంగా పని చేయించగలిగాం,” అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here