స్త్రీ శక్తి పథకానికి రూ. 400 కోట్లు నిధులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt Releases Rs.400 Cr To APSRTC For Stree Shakti Scheme

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్త్రీ శక్తి’ పథకం కింద రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అయిన ఖర్చుల కోసం నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం రూ. 400 కోట్ల అదనపు నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్టు 15 నుంచి ఈ పథకం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటినుంచి, అక్టోబర్ నెలాఖరు వరకు పథకానికి అయ్యే ఖర్చును ఆర్టీసీకి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు సర్కార్ నిధులను విడుదల చేసింది.

పథకం, నిధుల వివరాలు..
  • పథకం లక్ష్యం: రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం. ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది.
  • నిధుల విడుదల: రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
  • హర్షం: స్త్రీ శక్తి పథకానికి నిధులు విడుదల చేయడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, కార్మిక పరిషత్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎన్‌ఎంయూ నేతలు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here