భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9304 కరోనా పాజిటివ్ కేసులు, 260 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒకేరోజున ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. జూన్ 4, గురువారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,16,919 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 7 వ స్థానంలో నిలిచింది. మరోవైపు కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 6075 కి చేరింది. దేశంలో మొత్తం కరోనా బాధితుల్లో 1,04,107 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,06,737 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu