కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు 20 వేలకు పైగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 22,040 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో ఆగస్టు 5, గురువారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 34,93,603 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 117 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 17328 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 20,046 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 32,97,834 కు చేరింది. ప్రస్తుతం 1,77,924 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళ రాష్ట్రంలో ఇప్పటికి 2,80,75,527 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ