నీకోదండం తల్లి.. గాయానికి కుట్లు వేయకుండా. ఫెవిక్విక్ పెడతావా.. ఎక్కడో తెలుసా..?

Fevikwik Treatment A Shocking Incident In Karnataka Government Hospital, Fevikwik Treatment, A Shocking Incident In Karnataka, Karnataka Government Hospital, Fevikwik, Government Hospital, Medical Negligence, Nurse, Karnataka, Latest Karnataka News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. హనగల్ తాలూకాలోని ఆదూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ఓ నర్స్ గాయం మాన్చేందుకు స్టిచ్‌లు వేయాల్సిన చోట ఫెవిక్విక్‌ ఉపయోగించడం తీవ్ర వివాదానికి దారితీసింది.

సాధారణంగా వైద్యులు చిన్న గాయాలను కుట్టి చికిత్స అందిస్తారు. అయితే, ఈ నర్స్ మాత్రం కుట్లకు బదులుగా ఫెవిక్విక్‌‌ను వినియోగిస్తూ వచ్చిందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై పైస్థాయి అధికారులు స్పందించి, ఆమెపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఏం జరిగింది? 
జనవరి 14న హవేరి జిల్లా హనగల్ తాలూకాలోని ఆదూర్ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు గురుకిషన్ అన్నప్ప హోసమని ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అతని చెంప కట్ అవడంతో కుటుంబసభ్యులు చికిత్స కోసం ఆదూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్స్ జ్యోతి గాయానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌ అంటించి చికిత్స చేసింది.

ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన బాలుడి తల్లిదండ్రులు నర్సును ప్రశ్నించగా, “నేను ఎన్నో ఏళ్లుగా ఇలా చేస్తున్నాను. కుట్టిన ఊతం వేస్తే శాశ్వత మచ్చ మిగిలిపోతుంది. అందుకే ఫెవిక్విక్‌ ఉపయోగించడం ఉత్తమం” అని ఆమె సమాధానమిచ్చింది. అయితే, వైద్యపరంగా ఇది పూర్తిగా తప్పని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు.

వివాదం ఎలా చెలరేగింది?
తల్లిదండ్రులు ఈ సంఘటనను వీడియోగా రికార్డు చేసి, సంబంధిత ఆరోగ్య అధికారులకు ఫిర్యాదు చేశారు. వీడియో వైరల్ కావడంతో నర్సుపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరిగింది. మొదటగా ఆరోగ్య శాఖ అధికారులు ఆమెను బదిలీ చేయాలని నిర్ణయించగా, ప్రజల తీవ్ర ఆగ్రహం కారణంగా చివరికి ఆమెను సస్పెండ్ చేయాల్సి వచ్చింది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం స్పందిస్తూ, “ఆసుపత్రుల్లో చికిత్స అందించడానికి ఫెవిక్విక్‌‌ను ఉపయోగించకూడదు. ఇది వైద్య ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధం” అని ప్రకటన విడుదల చేసింది.

సరైన వైద్యం అందుతున్నదా?
ఈ సంఘటన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తాయి. ప్రాథమిక వైద్య చికిత్సలోనే నిర్లక్ష్యం చోటుచేసుకుంటే, తీవ్రమైన గాయాలకు సరైన వైద్యం అందుతుందా? అనే సందేహం ప్రజల్లో నెలకొంది.

ప్రస్తుతం నర్సు జ్యోతి వ్యవహారంపై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఒక ప్రభుత్వ వైద్యురాలు స్టిచ్‌ల స్థానంలో ఫెవిక్విక్‌ను ఉపయోగించడం నిజంగా వైద్యశాఖకు ఒక పెద్ద గుణపాఠం అని చెప్పొచ్చు. ఈ ఘటన తరవాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పద్ధతులపై మరింత కట్టుదిట్టమైన నిఘా అవసరమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.