మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు 5 వేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 10, శుక్రవారం నాడు 4,154 కరోనా కేసులు, 44 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64,91,179 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,38,061 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 4,524 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 62,99,760 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.05 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.12 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 49,812 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి మహారాష్ట్రలో 5,57,02,628 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ