కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సిద్ధమైంది. ఈ సమావేశాలు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభమై, డిసెంబర్ 19 వరకూ కొనసాగనున్నాయి. ఈ మేరకు సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం నాడు ధృవీకరించారు.
The Hon’ble President of India Smt. Droupadi Murmu ji has approved the proposal of the Government to convene the #WinterSession of #Parliament from 1st December 2025 to 19th December, 2025 (subject to exigencies of Parliamentary business).
Looking forward to a constructive &… pic.twitter.com/QtGZn3elvT
— Kiren Rijiju (@KirenRijiju) November 8, 2025
‘పార్లమెంటరీ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి డిసెంబర్ 1 నుంచి 19 వరకూ పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు’ అని మంత్రి రిజిజు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాగా, ఈ 19 రోజుల పాటు దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలు, కొత్త బిల్లుల ఆమోదం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.
దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలు జరపడం, కొత్త బిల్లులను ఆమోదించడం, పాత బిల్లులపై సమీక్ష చేపట్టడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన బిల్లులను సిద్ధం చేసింది. వివిధ సమస్యలపై చర్చల కోసం ప్రతిపక్షాలకు తగిన సమయం కేటాయించడం జరుగుతుంది.కీలకమైన చట్టపరమైన, పాలనాపరమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి.









































