దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ.. జొహన్నెస్‌బర్గ్‌లో ఘన స్వాగతం

PM Modi Arrives in South Africa To Attend G20 Summit, Receives Warm Welcome at Johannesburg

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్షిణాఫ్రికాలో ఘన స్వాగతం లభించింది. ఈ మేరకు ఆయన జీ20 దేశాధినేతల సమ్మిట్‌లో పాల్గొనేందుకు శుక్రవారం (నవంబర్ 21) జొహన్నెస్‌బర్గ్‌కు చేరుకోగా అక్కడ ఆయనకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది. ప్రెసిడెన్సీ మంత్రి ఖుంబుద్జో ఎన్‌టిషావెని  (Khumbudzo Ntshavheni) ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి మిలిటరీ పద్దతిలో స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు (నవంబర్ 21-23) జరిగే ఈ పర్యటనలో ప్రధాని పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

ముఖ్యాంశాలు
  • ఘన స్వాగతం: ప్రధాని మోదీకి వాటర్‌క్లూఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద సాంప్రదాయ స్వాగతం లభించింది. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెన్సీ మంత్రి ఖుంబుద్జో ఎన్‌టిషావెని ఆయనకు స్వాగతం పలికారు.

  • సాంస్కృతిక ప్రదర్శన: విమానాశ్రయంలో సాంస్కృతిక ప్రదర్శనకారులు సాంప్రదాయ నృత్యాలు, పాటలతో స్వాగతం పలికారు. ప్రధాని తమను ఆప్యాయంగా పలకరించడంతో పాటు, వేద మంత్రాలు పఠించిన చిన్నారులతో కూడా మాట్లాడారు.

  • గ్లోబల్ సౌత్‌ (Global South): ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న తొలి జీ20 సమ్మిట్ ఇదే కావడం దీని ప్రత్యేకత. ప్రధాని మోదీ గ్లోబల్ సౌత్‌కు సంబంధించిన ముఖ్య అంశాలపై భారతదేశ దృక్పథాన్ని, ఆందోళనలను ఈ వేదికపై తెలియజేయనున్నారు.

  • సమ్మిట్ థీమ్: ఈ ఏడాది జీ20 సమ్మిట్ థీమ్ ‘సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ’ (Solidarity, Equality, Sustainability)గా ఉంది.

  • ముఖ్య సమావేశాలు: జీ20 సమ్మిట్ సందర్భంగా, ప్రధాని మోదీ వివిధ ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు (Bilateral Meetings) నిర్వహించనున్నారు. అలాగే, భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా త్రైపాక్షిక కూటమి అయిన IBSA (ఇబ్సా) నేతల సమావేశంలో కూడా ఆయన పాల్గొననున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here