నేడు వర్షాలు పడే ప్రాంతాలివే…

Rains In Telangana For Five Days | Mango News Telugu

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. ఈ క్రమంలోనే.. వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది.. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈ నెల 22 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని చెప్పారు. వీటికి తోడు దక్షిణాన నైరుతీ రుతుపవనాలు ద్రోణిని ఏర్పాటు చేశాయిని చెప్పారు. ఉత్తర కర్ణాటక, తెలంగాణను ఆనుకొని ఒక తుపాను లాంటి సుడి ఏర్పడిందని తెలిపారు. దీని నుంచి ఒక ద్రోణి దక్షిణం వైపు ఉందని.. వీటన్నింటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు.

నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల, నారాయణపేట, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షానికి తోడు భారీగా ఈదురు గాలులు వీస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏపీలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది.. శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.