కోహ్లీ ఫైర్: స్టంప్ మైక్‌లో రికార్డైన సంచలన మాటలు!

Kohlis Sledge Show Stump Mic Captures The Drama, Kohlis Sledge, Stump Mic Captures The Drama, Stump Mic Captures Kohlis Sledge, India Vs Australia 2Nd Test, Pink Ball Test Highlights, Stump Mic Viral Video, Virat Kohli Sledging Controversy, Adelaide Test, Pink Ball Test, India Vs Australia, Team India Updates, Team India Playing XI, India Vs Australia, Team India, Austarlia, Test Cricket, WTC Final, Border Gavaskar Trophy, IND Vs AUS, IND Vs AUS Test Series, Cricket, Latest Cricket News, Cricket Live Updates, India, BCCI, Sports News, Sports Live Updates, Mango News, Mango News Telugu

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో అడిలైడ్ ఓవల్ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా యువ ఓపెనర్ మెక్‌స్వీనీపై స్లెడ్జింగ్ చేయడం వివాదాస్పదంగా మారింది. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనే ప్రయత్నంలో మెక్‌స్వీనీ తడబడగా, కోహ్లీ అతడిపై పదునైన వ్యాఖ్యలు చేశారు. “జాస్, అతనికి బంతిపై ఎలాంటి క్లూ లేదు. కానివ్వు!” అంటూ కోహ్లీ చేసిన కామెంట్స్ స్టంప్ మైక్‌లో రికార్డ్ కావడంతో, ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మ్యాచ్‌లో భారత్ ప్రదర్శన: 
భారత్ పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 180 పరుగులకే ఆలౌట్ అయింది. నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు, కేఎల్ రాహుల్ (37), గిల్ (31), రిషభ్ పంత్ (21) మినహా మిగతావారెవరూ ప్రభావం చూపలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు పడగొట్టి భారత ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. అనంతరం ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభించగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 86 పరుగులు సాధించింది. మెక్‌స్వీనీ (38), లబుషేన్ (20) క్రీజులో ఉన్నారు.