నిజామాబాద్ లో యువతిపై సమూహిక అత్యాచారం..

A Young Woman Was Gang-Raped In Nizamabad, A Young Woman Was Gang-Raped, Gang-Rape, Gang-Rape In Nizamabad, Nizamabad Gang-Raped, Nizamabad Rape Case, Young Woman Was Raped, Nizamabad Latest News, Nizamabad Live Updates, Nizamabad Crime News, Telangana, TS Politics, TS Live Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరవకముందే.. ఇప్పుడు నిజామాబాద్ లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో మొన్న రాత్రి నలుగురు దుండగులు ఒంటరిగా ఉన్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఆటోలో అక్కడి నుంచి డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు నగరానికి చేరుకుని శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని వన్​ టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ అత్యాచారానికి పాల్పడిన వారు డిచ్‌పల్లికి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత మహిళను వెంటబెట్టుకుని ఘటనాస్థలికి తీసుకెళ్లి పోలీసులు పరిశీలించారు. బస్టాండ్‌ వద్ద ఆటోకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిజామాబాద్​లో ఈ ఘటన సంచలనం రేపింది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాత్రి వేళ పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని కూడా వారు కోరుతున్నారు.

వరుస ఘటనలతో కలవరం : 20 రోజుల క్రితం వరంగల్‌లో కూడా ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె నమ్మిన స్నేహితుడే బలవంతంగా తీసుకెళ్లి తన మిత్రులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాట్లాడే పని ఉంది రావాలంటూ కారులో ఎక్కించుకొని వరంగల్​లోనే ఓ హోటల్​కు తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.