నగరంలోని గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన 16 ఫీట్ల మహాత్మాగాంధీ విగ్రహాన్ని రేపు గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరిస్తారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం జరుగుతున్న అభివృద్ధి పనులు, గాంధీ ఆసుపత్రి ముందు ఏర్పాటు చేస్తున్న 16 ఫీట్ల గాంధీ విగ్రహ పనులను, బహిరంగ సభ జరిగే ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, ఐజీ విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్, నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, హెఛ్ఎండీఏ ఎస్ఈ పరం జ్యోతి, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుగా ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎంజి రోడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారని చెప్పారు. అక్కడి నుండి పార్క్ లైన్, ప్యాట్నీ సిగ్నల్, క్లాక్ టవర్, సంగీత్, చిలకలగూడా చౌరస్తా మీదుగా గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకొని హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన 16 ఫీట్ల గాంధీ విగ్రహన్ని సీఎం ఆవిష్కరిస్తారని వివరించారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు గాంధీ మహాత్ముడు అని మంత్రి తలసాని పేర్కొన్నారు. గాంధీ జయంతి రోజున ఆయన్ని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రం సాధించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY