వేములవాడ దేవస్థానం అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Congress Govt Special Focus On Development Of Vemulavada Temple, Congress Govt Special Focus, Special Focus On Development Of Vemulavada Temple, Vemulavada Temple Development, Govt Special Focus Vemulavada Temple, Vemulavada Development Focus, Congress, Revanth Reddy, TS Govt, Vemulavada, derabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. రాష్ట్ర బడ్జెట్‌లో ఈ ఆలయానికి రూ.116 కోట్ల నిధులు కేటాయించగా, రూ.53 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 20న వేములవాడలో పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

మాస్టర్ ప్లాన్‌తో అభివృద్ధి ప్రణాళికలు:
ఆలయ విస్తరణకు సంబంధించిన కొత్త మాస్టర్ ప్లాన్‌ ద్వారా రోడ్ల వెడల్పు, కళ్యాణకట్ట, కోనేరు సందరీకరణ, గుడిచెరువు అభివృద్ధి, వసతి గదుల నిర్మాణం వంటి పలు సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. భక్తుల ఇబ్బందులను పరిష్కరించేందుకు నూతన ధర్మగుండం, క్యూలైన్ల విస్తరణ, ఆధునిక గోశాల, యాగశాల, అన్నదాన సత్రం వంటి వసతులు సమకూర్చే ప్రణాళికలు రూపొందించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి యేటా వేములవాడ ఆలయానికి వంద కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినా, కేవలం రూ.63 కోట్ల నిధులు మాత్రమే మంజూరు చేసింది. ఈ వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే భారీ నిధులు కేటాయించి ఆలయ అభివృద్ధిని తక్షణం ప్రారంభించింది.

సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు:
వేములవాడ ప్రాంతాన్ని టెంపుల్ సిటిగా అభివృద్ధి చేయడానికి, పర్యాటక రంగంలో విశేష ప్రోత్సాహం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. నేతన్నలకు ఉపాధి కల్పనలో భాగంగా నూలు డిపో మంజూరు చేస్తూ మరో రూ.50 కోట్లు కేటాయించగా, మధ్యమానేరు నిర్వాసితులకు ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున నిధులు విడుదల చేసింది.

ప్రస్తుతం ఆలయ పరిసరాలు, క్యూలైన్లలో సరైన సౌకర్యాల లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేస్తే ఈ సమస్యలు శాశ్వతంగా తొలగిపోతాయని ప్రభుత్వం పేర్కొంది. అభివృద్ధి పనుల తరువాత భక్తుల రాక మరింత పెరిగి, వేములవాడ దక్షిణ కాశిగా మరింత ప్రాచుర్యం పొందనుంది.

వేములవాడ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టు భక్తుల సౌకర్యాల పెంపుతోపాటు, పర్యాటక ఆర్థిక వ్యవస్థను గట్టిపరచడంలో కీలక పాత్ర పోషించనుంది. రేవంత్ సర్కారు చేపట్టిన ఈ చర్యలు రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కొత్త దిశగా మారనున్నాయి.