తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు, 177 రికవరీలు నమోదు

Covid-19 Updates in Telangana: 146 New Positive Cases on Feb 13

తెలంగాణ రాష్ట్రంలో మరో 146 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 13, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,96,574 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి కొత్తగా 177 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,93,210 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 98.86 శాతంగా ఉంది.

కరోనా వలన రాష్ట్రంలో మరో ఇద్దరు మరణించారు. దీంతో మరణించిన వారి మొత్తం సంఖ్య 1616 గా ఉంది. కాగా మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,748 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 29, రంగారెడ్డి జిల్లాలో 11, కరీంనగర్ లో 9, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 9, వరంగల్ అర్బన్ లో 8, సంగారెడ్డి లో 7, మంచిర్యాలలో 7 నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ