దేశ రాజధాని ఢిల్లీ గాలి కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది, అక్కడి ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. కానీ, ఈ పరిస్థితి ఢిల్లీలోనే కాదు, దేశంలో చాలా ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరుగుతోంది. కోల్ కత్తా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో గాలి కాలుష్యం పెరిగిపోతున్నది. ముఖ్యంగా, హైదరాబాద్ లో గాలి కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది.
హైదరాబాద్ లో కూకట్ పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. సోమవారం, పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300ని దాటింది. నవంబర్ 24న గూగుల్ AQI డేటా ప్రకారం, బంజారాహిల్స్ లో “పేలవమైన” ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 133, మాదాపూర్ టెక్ హబ్ లో 128, విట్టల్ రావునగర్ లో 157, జూ పార్క్ వద్ద 129గా నమోదు అయ్యాయి. ఢిల్లీ వంటి గాలి కాలుష్యం నగరంలో నమోదవుతున్న పరిస్థితిని చూసి ఆందోళన పెరిగింది.
ఈ పరిస్థితి మరింత చెడు కాక ముందే, పర్యావరణ నిపుణులు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో బాణసంచాలు పేల్చడంతో గాలి కాలుష్యం పెరిగింది. తాజాగా పరిశ్రమల నుంచి వచ్చే పొగ, వాహనాల వాడకం గాలి కాలుష్యాన్ని మరింత పెంచింది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 కంటే తక్కువగా ఉంటే మంచిది, 50 కంటే తక్కువ ఉంటే ఇంకా మంచిది. 100 కంటే ఎక్కువగా ఉంటే, అది ప్రమాదకరంగా మారుతుంది. అధిక స్థాయి గాలి కాలుష్యం వలన దగ్గు, శ్వాస కోశ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక కాలంలో, గాలి కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మరియు, చిన్న పిల్లలపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాయు కాలుష్యం పిల్లలలో ఊపిరితిత్తుల అభివృద్ధిని అడ్డుకుంటుంది, ఇది యుక్తవయస్సులో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.