రైతు భరోసా: కసరత్తు వేగవంతం చేసిన ప్రభుత్వం, అందరి ఆశలపై సంక్రాంతిపైనే..

Rythu Bharosa Governments Swift Moves Amid Opposition Allegations, Rythu Bharosa, Governments Swift Moves, Rythu Bharosa Opposition Allegations, Opposition Allegations, Agricultural Policies, Opposition Criticism, Rythu Bharosa Scheme, Telangana Farmer Welfare, Telangana Government Initiatives, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

తెలంగాణ రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం గురించి చర్చలు హాట్ టాపిక్‌గా మారాయి. సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించాలని రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు వేగవంతం చేసింది. కానీ, ప్రతిపక్షాలు ఈ పథకంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, అసలైన రైతులకు డబ్బు అందకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శలు గుప్పిస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీలో ఇటీవల ప్రకటించిన రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం ముఖ్యమైన మార్గదర్శకాలు రూపొందిస్తోంది. సాగు చేస్తున్న భూములకే ఈ పథకం వర్తించాలనే ప్రాథమిక నిబంధనను పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. 7 నుంచి 10 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ సాయం అందించాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది. శాటిలైట్ డేటా, టాక్స్ పేయర్ వివరాలు ఆధారంగా అర్హతలు నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ, బీమా పథకాల విషయంలో కూడా షరతులు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాల ఆరోపణలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ, పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలని ప్రభుత్వ ఆలోచన ఉందని చెప్పారు. కానీ పంట వేయనివారికి ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

ప్రస్తుతం రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకునే యోచనలో ఉన్న ప్రభుత్వం, వీటిని కేబినెట్‌లో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది. అయితే, సంక్రాంతికి ఇచ్చామని చెప్పిన రైతు భరోసా నిధులు, గైడ్‌లైన్స్ లేట్ కావడంతో ఈ పండగ తర్వాత మాత్రమే అందే అవకాశముందని సమాచారం.

ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్‌ఎస్ పార్టీ, ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేస్తూ, రైతుల నమ్మకాన్ని ప్రభుత్వం దెబ్బ తీస్తోందని ఆరోపిస్తున్నాయి. రైతుల ఆందోళనలతో పాటు రబీ పంట వేయడంలో వచ్చే సమస్యలు కూడా తీవ్రతరం అవుతున్నాయి. ఇక ఈ కేబినెట్ భేటీ తర్వాత ఫైనల్ గైడ్‌లైన్స్ ప్రకటించి రైతు భరోసా అందించే దిశగా ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.