ఏపీకి భారీ పెట్టుబడులు! యువతకు లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చేనా?

Massive Investments In Andhra Pradesh Will Millions Of Jobs Transform Youths Future, Millions Of Jobs Transform Youths Future, Massive Investments In Andhra Pradesh, Millions Of Jobs Transform Youth, Millions Of Jobs, AP Investments, Clean Energy Projects, CM Chandrababu, Major Corporations In Ap, Youth Employment, Andhra Pradesh, AP Live Updates, AP Politics, Political News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కీలక చర్యలు చేపట్టింది. మొత్తం రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో 2,63,411 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులు అమలు కానున్నాయి. సోమవారం సచివాలయంలో జరిగిన ఎన్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఆయా ప్రాజెక్టులకు భూ కేటాయింపులతో పాటు అవసరమైన మౌలిక వసతులు తక్షణమే అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

బీపీసీఎల్ రిఫైనరీ: నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ నిర్మాణం. ఇది 2,400 మందికి ఉపాధిని కలిగించడంతో పాటు 20 ఏళ్లలో రూ.88,747 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రానికి అందించనుంది.
టీసీఎస్ విస్తరణ: విశాఖ మిలీనియం టవర్స్‌లో టీసీఎస్ రూ.80 కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
ఆజాద్ మొబిలిటీ ప్రాజెక్టు: శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల గ్రీన్ ప్రాజెక్టు కోసం రూ.1,046 కోట్ల పెట్టుబడితో 2,381 మందికి ఉపాధి.
క్లీన్ ఎనర్జీతో ప్రతిపాదనలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్లీన్ ఎనర్జీ పాలసీతో రూ.83 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

రిలయన్స్ ప్రాజెక్టులు:
రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.65 వేల కోట్ల పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తోంది. 2028 నాటికి పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు 2.5 లక్షల మందికి ఉపాధిని కల్పించడంతో పాటు రూ.4,095 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రానికి అందించనుంది. ఈ ప్రాజెక్టులన్నీ అమలులోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు మరియు యువత ఉపాధి అవకాశాలకు ప్రధాన కేంద్రంగా మారనుంది.