కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం లభించాక, గత డిసెంబర్ లోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చట్టంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం నాడు మాట్లాడుతూ, కరోనావైరస్ మహమ్మారి కారణంగా పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ) అమలు ఆలస్యం అయిందని, త్వరలోనే ఈ చట్టం అమలు చేయబడుతుందని చెప్పారు. సీఏఏ అమలుకు బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని జేపీ నడ్డా పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్లో జరిగిన ఓ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జేపీ నడ్డా మాట్లాడుతూ, “పౌరసత్వ సవరణ చట్టంతో అందరికి ప్రయోజనాలు చేకూరతాయి. ఈ చట్టం అమలుకు మేము కట్టుబడి ఉన్నాము. కరోనావైరస్ కారణంగా చట్టం అమలు ఆలస్యం అయింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా సీఏఏ అమలు చేయబడుతుంది” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu