దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చాక దేశంలో తొలిసారిగా 24 గంటల వ్యవధిలో లక్షకుపైగా (1,03,558) కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత సెప్టెంబర్ 17న ఒకేరోజులో నమోదైన 97,894 కేసులే ఇప్పటివరకు అత్యధిక సంఖ్యగా ఉంది. కొత్తగా ఒకేరోజులో లక్షకుపైగా కేసులు నమోదవడం కరోనా తీవ్రతకు అద్దంపడుతోంది. అయితే కొత్తగా నమోదైన 1,03,558 కేసుల్లో 57,074 కేసులు ఒక్క మహారాష్ట్ర రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఏప్రిల్ 5, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,89,067 కు చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 478 మరణాలు నమోదుకావడంతో మరణాల సంఖ్య 1,65,101 కు చేరుకుంది.
ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 7,41,830 (5.89%) కు చేరుకుంది. మరోవైపు 52,847 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,16,82,136 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 92.80 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.31 శాతంగా ఉంది. ఇక ఏప్రిల్ 4, ఆదివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 24,90,19,657 కు చేరుకుంది. గత 24 గంటల్లో 8,93,749 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ