వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం రూ.15 కోట్ల సాయం, కృతజ్ఞతలు తెలిపిన సీఎం కేసీఆర్

Arvind Kejriwal Rs 15 Cr Assistance To Telangana, CM Arvind Kejriwal for Extending Rs 15 Cr Assistance, CM KCR, CM KCR Thanked Delhi CM Arvind Kejriwal, Compensation For Flood Affected Families In Hyderabad, Delhi CM Arvind Kejriwal, Heavy Rains In Hyderabad, Hyderabad Rains, Hyderabad Rains news, Minister KTR, Rains In Hyderabad, telangana, Telangana rains, telangana rains news, telangana rains updates

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలతో సహా హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పెద్దఎత్తున నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వ సహాయానికి స్పందిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈరోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో ఫోన్లో మాట్లాడారు. రూ.15 కోట్ల సాయం ప్రకటించినందుకు తెలంగాణ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు సీఎం కేసీఆర్ దన్యవాదాలు తెలిపారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా రూ.10 కోట్ల ఆర్ధిక సాయాన్ని తెలంగాణకు ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =