రేప్ అంటే ఏమిటి? అని అడిగిన రెండు రోజులకే బాలికపై సామూహిక అత్యాచారం

Miner Girl Was Gang Raped Two Days After Asking That What Is Rape, Miner Girl Was Gang Raped In Assam, Assam Teen Had Asked Aunt What Rape, Assam Gang Rape, Crime News, 13 Year Old Girl Raped, Girl Raped In Assam, Miner Girl Raped, Nagaon District, What Is Rape, Latest Assam Gang Rape News, Assam Live Updates, Assam Latest Crime News, Assam, National News, Mango News, Mango News Telugu

అస్సాంలోని నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల మైనర్ బాలికపై ఆగస్టు 22న సామూహిక అత్యాచారం సంఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరగడానికి రెండు రోజుల ముందు బాధితురాలు తన అత్త తో మాట్లాడుతూ, “ఆంటీ , రేప్ అంటే ఏమిటి?” అని అడిగినట్లు తెలుస్తోంది. అలా అడిగిన రెండు రోజులకే ఆమెకు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ విషయాన్ని సదరు బాలిక బంధువే స్వయంగా వెల్లడించారు. కాగా, గువాహటిలో ఉండే బాలిక తండ్రికి ఆమెను చదివించే స్తోమత లేక తన బంధువుల వద్దకు పంపారు.

కొన్ని వారాల క్రితం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పరిణామాలు రోజూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ అమ్మాయి వార్తాపత్రికలలో ఈ వార్తను చదివింది. అనంతరం “అత్తా, రేప్ అంటే ఏమిటి?” అని నన్ను అడిగారని మైనర్ బాలిక బంధువు తెలిపారు. కానీ తనకే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదని పేర్కొన్నారు. తను డీఎస్పీ కావాలని కలలు కన్నదని తెలిపారు. ఆమెను పరామర్శించేందుకు డీఎస్పీ ఆసుపత్రికి వస్తే అంతటి కష్టంలోనూ తన ముఖంపై చిరునవ్వు నే ప్రదర్శించిందని అని మీడియా కు బాధిత బాలిక బంధువు వెల్లడించారు. తన కుమార్తె తనతో కనీసం మాట్లాడలేకపోయిందని.. ఆ స్థితిలో ఆమెను చూసి తన హృదయం ముక్కలైందని బాలిక తండ్రి వాపోయారు.

నాగావ్ జిల్లాలోని డింగ్‌లో తన ఇంటికి కేవలం ఒక కి.మీ దూరంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆగస్టు 22న ట్యూషన్‌ తరగతులు ముగించుకుని ఇంటికి వస్తుండగా దుండగులు ఆమెపై దాడి చేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. బాలిక తన అత్త మరియు తాతలతో నివసించింది. ట్యూషన్‌ పూర్తయ్యాక అత్తతో కలిసి లేదా ఆటోరిక్షాలో ఇంటికి వచ్చేది. అయితే ఘటన జరిగిన రోజు ఆమె సైకిల్‌ను తీసుకెళ్లింది. ఆమె పడిపోయిన చోటుకు కొద్ది దూరంలో ఓ సైకిల్ కనిపించింది. ఈ ఘటన అస్సాంలో తీవ్ర కలకలం రేపింది. బాలికకు న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని నిరసనలు చేపట్టారు. కాగా ఈ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల్లో ఒకరైన తఫాజుల్ ఇస్లాం ఘటనాస్థలికి తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చెరువులో దూకి చనిపోయాడు.