తెలంగాణ విజయోత్సవాలకు ఆహ్వానం: కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆహ్వానం..?

Will Former CM KCR Kishan Reddy And Bandi Sanjay Attend Telangana Celebrations, Former CM KCR, Telangana Celebrations, Former CM KCR, Kishan Reddy, Political Invitations, Statue Unveiling Event, Telangana Celebrations, CM Revanth Reddy, Hyderabad Live Updates, Latest Hyderabad News, Political news, Telangana, TS Live Updates, TS Politics, Mango News, Mango News Telugu

తెలంగాణ‌లో రేపటి నుంచి మూడు రోజుల పాటు విజయోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆహ్వానాలను అందించేందుకు వీరిని సంప్రదించి సమయం అడుగుతున్నామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం తరపున అందరికీ ఆహ్వానాలు ఇచ్చి, వారి హాజరును కోరుతున్నామని, ముఖ్యంగా 9వ తేదీ జరగబోయే విగ్రహ ఆవిష్కరణలో ఈ నేతల హాజరుకు ప్రభుత్వ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి వివరించారు.

ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకలను ఈనెల 7, 8, 9 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల విజయవంతానికి సంబంధించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.