తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది జనసేన పార్టీ. కాషాయపు పార్టీతో పొత్తుపెట్టుకొని.. కూకట్ పల్లి సహా 8 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ తమ అభ్యర్థుల గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తించారు. తెలంగాణలో జనసేన కనీసం రెండు స్థానాల్లో అయినా గెలిచి తీరుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పలు సర్వేలు కూడా అదే చెబుతున్నాయి. అయితే తెలంగాణలో జనసేన పోటీ చేయడంపై ఏపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. వైసీపీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలయింది.
ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో జనసేన 148 స్థానాల్లో పోటీ చేసింది. కానీ సత్తా చాటుకోలేకపోయింది. కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపు జెండా ఎగరవేసింది. రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన గెలుపొందింది. అటు పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన రెండుస్థానాల్లోనూ ఓడిపోయారు. అయితే జనసేన ఒకే ఒక్క స్థానంలో గెలుపొందడం.. పవన్ రెండు స్థానాల్లో ఓడిపోవడంపై అప్పట్లో వైసీపీ జనసేన విఫల పార్టీ అని ముద్రవేసింది.
అయితే ప్రస్తుతం తెలంగాణలో తమ అభ్యర్థులను జనసేనాని ఏ మేరకు గెలిపించుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. పవన్ తెలంగాణలో తమ అభ్యర్థులను గెలిపించుకుంటే.. వైసీపీ వేసిన విఫల నాయకుడనే అపవాదు పోతుందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా తెలంగాణలో జనసేన తమ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా.. ఏపీలో ఆ పార్టీ మరింత పుంజుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే జనసేన గతంతో పోల్చుకుంటే.. ఏపీలో భారీగానే పుంజుకుంది.
అటు తెలంగాణలో జనసేన పోటీ చేయడం.. తమ అభ్యర్థుల గెలుపు కోసం జనసేనాని తీవ్రంగా కృషి చేయడం.. కనీసం రెండు స్థానాల్లో అయినా జనసేన గెలుస్తుందని సంకేతాలు వెలువడడంతో వైసీపీ పార్టీలో కొత్త టెన్షన్ మొదలయింది. తెలంగాణలో రెండు, మూడు స్థానాల్లో జనసేన గెలిస్తే.. దాని ప్రభావం ఏపీ పైన కూడా ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే జనసేన తెలంగాణలో దక్కించుకునే స్థానాలపై వైసీపీ నేతలు ఓ కన్నేశారు. ఆయా స్థానాల్లో ఏం జరుగుతోంది?.. పరిస్థితి ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE