ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభంకాగా, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసనసభలో వరుసగా రెండో సారి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ఈ బడ్జెట్ను రూపొందించింది. మరోవైపు శాసనమండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్చంద్రబోస్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ఏపీ బడ్జెట్ 2020-21 హైలైట్స్:
- బడ్జెట్ అంచనా వ్యవయం రూ.2,24,789.18 కోట్లు
- రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు
- మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు
బడ్జెట్ కేటాయింపులు:
- ఆర్థిక రంగం – రూ. 50,703 కోట్లు
- విద్యరంగం – రూ.22,604 కోట్లు
- పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్కు రూ. 16710.34 కోట్లు
- పశుగణాభివృద్ధి, మత్స్యరంగం – రూ.1279.78 కోట్లు
- సోషల్ వెల్ఫేర్ – రూ.12,465.85 కోట్లు
- వ్యవసాయరంగం – రూ.11,891 కోట్లు
- జలవనరుల శాఖ – రూ. 11,805.74 కోట్లు
- ఆరోగ్య రంగం – రూ.11,419.44 కోట్లు
- మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ – రూ. 8150.24 కోట్లు
- విద్యుత్ రంగం – రూ. 6,984.72 కోట్లు
- ట్రాన్స్పోర్టు, ఆర్అండ్బీ కోసం రూ.6,588.58 కోట్లు
- హోంశాఖ – రూ.5,988.72 కోట్లు
- గృహ నిర్మాణ రంగం – రూ.3,691.79 కోట్లు
- పౌరసరఫరాల శాఖ – రూ. 3,520.85 కోట్లు
- మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం – రూ.3456.02 కోట్లు
- న్యాయశాఖ – రూ. 913.76 కోట్లు
- స్కిల్ డెవలప్మెంట్ – రూ. 856.64 కోట్లు
- పెట్టుబడులు, మౌలిక వసతుల రంగం – రూ.696.62 కోట్లు
- కార్మిక సంక్షేమం – రూ. 601.37 కోట్లు
- ఐటీ రంగం రూ. 197.37 కోట్లు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu