తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సీఎం చంద్రబాబు తీవ్ర విచారం:
ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) November 3, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన:
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన తన ప్రకటనలో మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాక, భవిష్యత్తులో ఇలాంటి భయంకరమైన ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అండదండలు లభిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు.
చేవెళ్ళ బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం
తెలంగాణ రాష్ట్రం చేవెళ్ళ దగ్గర చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో… ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీ కొట్టడంతో 17 మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు…
— JanaSena Party (@JanaSenaParty) November 3, 2025


































